సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ములుగు డీఎస్పీ 

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పలు సమస్య ఆత్మక పోలింగ్ ఉ కేంద్రాలను శనివారం ములుగు డిఎస్పి ఎన్ రవీందర్ పరిశీలించారు. స్థానిక సీఐ శంకర్ మరియు ఎస్ఐ ఏ కమలాకర్ తో కలిసి మండలంలోని రంగాపూర్, ముత్తాపూర్, ప్రాజెక్టు నగర్, చల్వాయి, పసర వంటి మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో  పోలింగ్ కేంద్రాల ను పరిశీలించడం జరిగింది. పోలింగ్ కేంద్రాల పరిశీలన అనంతరం గతంలో జరిగిన పోలింగ్ విధానాన్ని అడిగి తెలుసుకుని పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love