పోరాడి ఓడిన ముంబయి..

నవతెలంగాణ- ఢిల్లీ: ఐపీఎల్‌-17లో ఢిల్లీ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 258 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి 9 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితమైంది. తిలక్‌ వర్మ (63) అర్ధశతకంతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (20), రోహిత్‌ శర్మ (8) నిరాశపరిచారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (26; 13 బంతుల్లో 3×4, 2×6), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (46; 24 బంతుల్లో 4×4; 3×6), టిమ్‌ డేవిడ్‌ (37) ఫర్వాలేదనిపించారు. బౌలర్లలో రసిక్‌ దార్, ముకేశ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఖలీల్‌ 2 వికెట్లు తీశాడు.

Spread the love