ఓటర్ స్లిప్పుల పంపిణీ: తహసీల్దార్

నవతెలంగాణ – నెల్లికుదురు
త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓటర్ దారులకు ఓటర్ స్లిప్పులను అందిస్తున్నట్లు నెల్లికుదురు మండల తహసిల్దార్ కోడ్ చింతల రాజు తెలిపారు. శనివారం తో కలిసి మండల కేంద్రంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో సందర్భంగా ముందస్తుగా ఓటరు దారులకు ఓటర్ స్లిప్పులను అందిస్తున్నామని అన్నారు. ఈ స్లిప్పులను చూసుకొని ఓటర్ దాటుడు కంగారు పడకుండా ఏ బూతులు ఎవరి ఓటు ఉందని చూసుకునే అవకాశం ఉందని అన్నారు. దీని ఆధారంగా నేరుగా వెళ్లి వారు ఓటు వేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎవరికీ భయపడకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రసన్న, బిఎల్ ఓ లు పద్మ, స్వప్న, రమేష్, రాంబాబు పాల్గొన్నారు.
Spread the love