కాంగ్రెస్ లో చేరిన ముస్లిం సోదరులు..


నవతెలంగాణ డిచ్ పల్లి: ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన పలువురు బిఅర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి తిర్మన్ పల్లి ఎంపిటిసి చింతల కిషన్ అధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సమక్షంలో శుక్రవారం చేరారు. ఎమ్మెల్యే చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ లో చేరిన వారందరూ పార్టీ అబివృద్దికి ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. కోత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్, సంతోష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్ పాషా, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, మోతిలాల్, ఎల్ఐసి గంగాధర్, జమీల్ పాషా, బోర్ వెల్ రాజేందర్ రెడ్డి,జంగిలి లక్ష్మి, సద్ధం, ఫయజ్, సలీం, జునేద్, ప్రవీణ్ గౌడ్ తోపాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love