జూబ్లీహిల్స్‌లోని ప్రోస్ట్‌లో బుష్‌మిల్స్‌తో కలిసి ప్రత్యేక పార్టీని నిర్వహించిన నాగచైతన్య

నవతెలంగాణ-హైదరాబాద్ : చైతన్య అక్కినేని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ప్రోస్ట్‌లో ప్రత్యేక పార్టీకి హోస్ట్‌గా వ్యవహరించారు. బుష్‌మిల్స్ సహకారంతో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం, బుష్‌మిల్స్ యొక్క మహోన్నత వారసత్వం, ప్రఖ్యాత షోయు రూపొందించిన సున్నితమైన కలినరీ అనుభవంతో పాటు అసాధారణ వేడుకగా ఆవిష్కృతమైంది, ప్రోస్ట్, దాని ఆకర్షణీయమైన మరియు సమకాలీన వాతావరణంతో, బుష్‌మిల్స్ మాయాజాలాన్ని అనుభవించడానికి సరైన నేపథ్యాన్ని ఏర్పరచింది. శతాబ్దాల సంప్రదాయంతో, బుష్‌మిల్స్ అత్యుత్తమ స్థానిక పదార్ధాలతో కాలానుగుణమైన పనితనం మిళితం చేసి , ప్రపంచంలోనే అత్యుత్తమ మరియు పురాతన లైసెన్స్ కలిగిన డిస్టిలరీ గా తాము ఎందుకు నిలిచామని మరోసారి రుజువు చేసింది. సినీ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అయిన చైతన్య అక్కినేని ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా ఉన్నారు, బుష్‌మిల్స్ వారసత్వం మరియు నైపుణ్యానికి తన ప్రశంసలను వ్యక్తం చేశారు. ఈ పార్టీకి కాంతి దత్, మీనాక్షి పమ్నాని, సుధా రెడ్డి, నమ్రతా సాధ్వానీ తదితరులు హాజరయ్యారు. చైతన్య అక్కినేని ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ “బుష్‌మిల్స్ మరియు షోయుతో ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సాయంత్రం హస్తకళ, సంప్రదాయం మరియు జీవితంలోని అత్యుత్తమ విషయాలను పంచుకున్నందుకు సంతోషంగా ఉంది..” అని అన్నారు మోనికా ఆల్కోబెవ్‌లో నేషనల్ సేల్స్ డైరెక్టర్‌గా హేమంగ్ చందత్ మాట్లాడుతూ, “ఇది తమ బ్రాండ్‌ దృష్టి కేంద్రీకరించిన మార్కెట్. ఈ డైనమిక్ సిటీలో అసాధారణమైన విస్కీ అనుభవాన్ని అందించాలనే తమ నిబద్ధతను ఈ పార్టీ పటిష్టం చేస్తుంది.. ” అని అన్నారు.

Spread the love