ఇంటర్ ఫలితాల్లో నందినికి 464 మార్కులు..

నవతెలంగాణ – డిచ్ పల్లి

డిచ్ పల్లి మండలం లోని ఖిల్లా డిచ్ పల్లి శివారులోని కెజిబివిలో మండలంలోని రాంపూర్ డి గ్రామానికి చెందిన లచ్చమొల్ల నందినికి ఎంపిసి 470కి గాను 464మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ సవిత బుధవారం తెలిపారు. నందిని తల్లిదండ్రులు నవత, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి లచ్చమొల్ల దత్తాద్రి మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలల కంటే ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఇంటర్ ఫలితాల్లో తమ సత్తా నిరుపించుకున్నరని, ప్రైవేటు కు దిటుగా విద్యాబుద్ధులు నేర్పించి రాని, ఇదే కాకుండా మొత్తం 66  విద్యర్థులకు గాను ఇద్దరికీ 464, 461, 460 రావడం అభినందనీయమని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంత మంచి ఫలితాలు రావడం అధ్యాపకులు విద్యార్థులు నేర్పిన విద్య వల్లే సాధ్యమైందని,వారు చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని నవత, లచ్చమొల్ల దత్తాద్రి వివరించారు. ఉత్తిర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
Spread the love