తోట లక్ష్మీకాంతారావు లాంటి ఎమ్మెల్యేను ఎప్పుడూ చూడలేదు..

నవతెలంగాణ – మద్నూర్

జుక్కల్ నియోజకవర్గం లో ఎందరో ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు కానీ ప్రస్తుతం జుక్కల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తోట లక్ష్మీ కాంతారావు లాంటి ఎమ్మెల్యేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదని అభిప్రాయం జుక్కల్ నియోజకవర్గం ప్రజల్లో వ్యక్తం చేసుకుంటూ.. ఎమ్మెల్యే పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేసుకుంటున్నారు. వెనుకబడిన జుక్కల్ ప్రాంతం అభివృద్ధి పట్ల ఎమ్మెల్యేగా తోటా లక్ష్మి కాంతారావు డిపార్ట్మెంట్ల వారిగా అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు చేపడుతూ.. అభివృద్ధి పనుల పట్ల సమీక్షలు జరపడం ఇదే ఎమ్మెల్యేను చూస్తున్నామని నియోజకవర్గం ప్రజల్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రెండు రకాల ముఖ్యమైన సీజన్లు ఒకటి వర్షాకాలం రెండవది వ్యవసాయానికి పంటల సాగు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభులకుండా జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో గల వైద్యశాఖ అధికారులతో ప్రజల ఆరోగ్యాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి శుక్రవారం నాడు నిర్వహించిన వైద్యాధికారుల సమీక్ష సమావేశంలో వైద్యులకు వైద్య సిబ్బందికి సూచించడం జరిగింది. అదేవిధంగా వానాకాలం ప్రారంభమైంది వ్యవసాయ రైతులు పంటల సాగు చేస్తారు విత్తనాలు ఎరువులు నక్కిలివి కాకుండా ప్రత్యేకమైన నిగా పెట్టాలని నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రైతులకు రైతు భరోసా అలాగే రెండు లక్షల వరకు రుణమాఫీ పథకాల అమలు అర్హులైన వారికే అందించడానికి గుర్తించాలని ఆదేశాలు జారీ చేయడం, ఎమ్మెల్యే జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రజల సంక్షేమం పట్ల ప్రత్యేకంగా చొరవ చూపడం, ఇలాంటి ఎమ్మెల్యేను ఇంతవరకు చూడలేమని నియోజకవర్గం ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుంది.
Spread the love