కాండ్రకోట మిస్టరీ అంటూ యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రం రాబోతోంది. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్లో ఇంట్రెస్ట్ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ టీజర్ను నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ బాగుందని ఆయన చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్తో మొదలైన ఈ టీజర్లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తోంది. దాంతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉందని అర్థమవుతోంది. ఇక ఈ టీజర్లోని విజువల్స్ ఎంతో నేచురల్గా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ మూడ్కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.