నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కీ మిస్డ్ కాల్ ఉద్యమం

నవతెలంగాణ- బోధన్ టౌన్
బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ లో గల్ల నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం వెంటనే తెరిపించి ప్రభుత్వపరం చేసి, 2015 సంవత్సరం నుండి  కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అడ్లూరి శ్రీనివాస్ న్యాయవాది బోధన్ నియోజక వర్గం అయన శుక్రవారం నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు అన్నారు. అనంతరం నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేట్ ముందు మాట్లాడుతూ.. అనారోగ్య కారణాలతో చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకుని, కబ్జాలకు గురి అవుతున్న నిజాం షుగర్స్ భూములను రక్షించాలనే డిమాండ్ చేశారు. మిస్డ్ కాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. కావున 8447369369 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెల్పవలసింది గా బోధన్ నియోజక వర్గ ప్రజలందరినీ కోరుతున్నాను.
Spread the love