నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘నేషనల్ మీన్స్ కం మెరిట్’ స్కాలర్షిప్ పథకం గతేడాది డిసెంబర్ 18న నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ కృష్ణారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల కోసం http//bse.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.