ఉప్పలో స్టేడియంలోకి వారికి నో రీఎంట్రీ

నవతెలంగాణ- హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న తొలి టెస్ట్ కు 1500 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 360 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 5 వరకు జరగనుండగా, 3 గంటల ముందు నుంచే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. స్టేడియంలోకి ఒకసారి వచ్చి బయటకు వెళ్తే మళ్లీ ప్రవేశం ఉండదని పోలీసులు తెలిపారు.

Spread the love