యాదాద్రి ఈఓపై బదిలీ వేటు

నవతెలంగాణ హైదరాబాద్: యాదాద్రిలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయశాఖా మంత్రి కొండా సురేఖలకు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క, కొండా సురేఖను కింద కూర్చోబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. కాగా, ఈ సంఘటనలో యాదగిరిగుట్ట ఆలయ ఇంచార్జ్ ఈఓ రామకృష్ణ రావుపై బదిలీ వేటు వేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి, మహిళా మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేయడంపై వివాదం తలెత్తింది. ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం చేసినందుకు గాను యాదగిరిగుట్ట ఆలయ ఇంచార్జ్ ఈఓ రామకృష్ణ రావుపై చర్యలు తీసుకున్నారు. ఇక నూతన ఈవోగా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు బాధ్యతలు చేపట్టారు. యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు నాలుగు రోజుల కిందట పర్యటించిన విషయం పాఠకులకు విధితమే.

Spread the love