– కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో కేసీఆర్, హరీశ్రావు పూజలు
నవతెలంగాణ- నంగునూరు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామ వెంకటేశ్వర స్వామివారిని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు శనివారం మధ్యాహ్నం దర్శించుకు న్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో కేసీఆర్కు స్వాగతం పలికారు. స్వామివారి పాదాల ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు నామినేషన్ పత్రాలు పెట్టి పూజలు చేశారు. అనంతరం నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. అదే రోజు సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు నామినేషన్ వేయనున్నా రు. వారి వెంట ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, జిల్లా పరిషత్ చైర్మెన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీ వేణుగోపాల్ చారి, బీఆర్ఎస్ ఇన్చార్జి వంశీధర్రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సుడా, ఉన్నారు.