అహింస మార్గమే యువతకు ఆదర్శం..

నవతెలంగాణ- రాయపోల్: గాంధీ చూపిన స్వరాజ్య పాలన మార్గంలోని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, అహింస మార్గమే నేటి యువతకు ఆదర్శమని రాయపోల్ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాయపోల్ మండల కేంద్రంలో రాయపోల్ మండల కేంద్రంలో 154 వ గాంధీ జయంతి సందర్భంగా  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయపోల్ మండల కేంద్రంలో 154 వ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ పాత్ర ఎనలేనిదని సత్యం అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించారని ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మున్నయ్య, రాయపోల్  సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి,పంచాయతీ కార్యదర్శి శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు కల్లూరి శ్రీనివాస్,స్వామి తదతరులు పాల్గొన్నారు.
Spread the love