వారే కాదు వీరూ నా గురువులే : రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ

నవతెలంగాణ న్యూఢిల్లీ: తాను ఎంతో మంది మహానుభావుల నుంచి సమాజాన్ని ప్రేమించడం నేర్చుకున్నానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. వారికే కాదు ప్రత్యర్థులను కూడా నేను గురువులుగా భావిస్తున్నానని అన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘దేశంలోని ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఘన నివాళి అర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో ముఖ్యమైంది. మహాత్మ గాంధీ, నారాయణ గురు, గౌతమ బుద్ధుడు నా గురువులు. సమాజంలోని ప్రతి ఒక్కరి పట్ల కరుణ, ప్రేమ, సమానత్వం చూపాలనే జ్ఞానాన్ని వారి నుంచే పొందాను. అదే విధంగా నా ప్రత్యర్థులను కూడా గురువులుగా భావిస్తున్నాను. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. వారి ప్రవర్తన, అబద్ధపు మాటల ద్వారా నేను అనుసరిస్తున్న మార్గం కచ్చితంగా సరైనదేనని బోధిస్తుంటారు. అందుకే వారిని కూడా నా గురువులుగా భావిస్తున్నాను’’ అని రాహుల్‌  పేర్కొన్నారు.

Spread the love