నవతెలంగాణ – హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారకరామా రావు 101 జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కొంతమంది రాజకీయ నేతలు ఎన్టీఆర్ తో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగువారి గుండెచప్పుడు.. ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఆయన అని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.