నవతెలంగాణ – హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలంలోని కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం వైపు బయల్దేరింది. ఈ క్రమంలో రాజమహేంద్రవరం నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ కిష్టారం సమీపంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంతో సుమారు కిలోమీటరుమేర వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ను క్లియర్ చేశారు.