అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య..

నవతెలంగాణ – డిచ్ పల్లి
అప్పుల బాధ తో మనస్థాపం చేంది ఇంట్లోనే ఉరి వేసుకుని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన వడ్ల గంగాధర్ 36 అప్పులు కావడంతో దిక్కుతోచక, రోజు మధ్యానికి బానిసై ఆదివారం ఉదయం మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. భార్య నిజామాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తుండడంతో ఇంట్లో ఆయన కుమారుడు కూతురు ముందు బెడ్ రూమ్ లోకి వెళ్లి లోపల నుండి గొల్లం పెట్టుకొని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సమయంలో  ఇద్దరు పిల్లలు హాల్లో ఉండగా శబ్దం రావడంతో పిల్లలు బిక్కు బిక్కుమంటు భయకంపితు లాయ్యారు. బెడ్ రూమ్ తలుపులు తీసి చూడగా లోపల నుండి గొల్లం పెట్టినట్టు అర్థమైంది. పిల్లల అరుపులు ఏడ్పులు చూసిన పక్కింటి వారు గమనించి ఏమైందో తెలియక సర్పంచ్ లోలం సత్యనారాయణ, ఉప సర్పంచ్ రఘునథన్ రాము కు సమాచారాన్ని అందించారు వెంటనే సమాచార అందుకున్న సర్పంచ్ లోలం సత్యనారాయణ, ఉపసర్పంచ్ రఘునథన్ రాము లు ఇంటికి చేరుకొని తలుపు తీసి చూడగా తలుపు లోపలి నుండి గొళ్ళెం పెట్టినట్టు, తలుపులను తేరచి చూడడంతో ఆయన ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్టు కనిపించింది వెంటనే ఇందల్ వాయి ఎస్ఐ నరేష్ కుమార్ కు సమాచారం అందించగా ఘటన స్థలానికి ఎస్సై నరేష్ కుమార్ చేరుకొని ఆత్మహత్య చేసుకున్న గంగాధర్ రాజు శవాన్ని చూసి కేసు నమోదు చేసుకుని పోస్ట్మార్టం నిమితం అస్పత్రకి తరలించారు.

Spread the love