మేడారం జాతర సందర్భంగా బస్సుల కొరతను అర్థం చేసుకోవాలి

– డిపో మేనేజర్ బి శ్రీనివాస్
నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ రాష్ట్ర మహా కుంభమేళమైన “మేడారం జాతర ” ను పురస్కరించుకుని  యాదగిరిగుట్ట డిపో నుండి 60 బస్సులు, 160 మంది ఉద్యోగులు జాతర స్పెషల్ డ్యూటీ పై వెళుతున్న కారణంగా ప్రయాణికులు అర్థం చేసుకొని, సహకరించాలని యాదగిరిగుట్ట డిపో మేనేజర్ బి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 18 నుండి 25 వరకు వారం రోజుల పాటు యాదగిరిగుట్ట డిపో పరిధిలో కేవలం 30 బస్సులు మాత్రమే నడుస్తాయని ఆయన తెలిపారు. బస్సుల, సిబ్బంది కొరత వల్ల కలిగే అసౌకర్యాన్ని ప్రయాణికులు, విద్యార్థులు,పరిసర గ్రామాల ప్రజలు, యాదగిరిగుట్ట దైవదర్శనం కోసం వచ్చే భక్తులు అర్థం చేసుకొవాలన్నారు.  ఆర్టీసీ కి సహకరించాలని ఆయన కోరారు.
Spread the love