అక్టోబర్‌ 16 నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో దూరవిద్య పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు వచ్చేనెల 16 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) డైరెక్టర్‌ పివి శ్రీహరి గురువారం టైంటేబుల్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు రెండు విడతల్లో జరుగుతాయని వివరించారు. జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు వచ్చేనెల 30 నుంచి నవంబర్‌ ఆరో తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు.

Spread the love