కాంగ్రెస్ మత్స్య సహకార సంఘ అధ్యక్షుడిగా పి. శ్రీనివాస్

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోని బోర్గం( పి) గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. శ్రీనివాస్ నీ కాంగ్రెస్ పార్టీ మత్స్య సహకార సంఘ అధ్యక్షుడిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మరియు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపతి రెడ్డి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నా సేవలను గుర్తించి ఈ పదవిని ఇచ్చినందుకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కి మరియు మహేష్ కుమార్ గౌడ్ కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది .అలాగే కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలు అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని రాష్ట్రంలో కెల్లా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోపాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు భూన్నె రవి మరియు మాజీ ఎంపీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, ఎంపీటీసీలు రమేష్ మరియు రాములు తదితరులు పాల్గొనడం జరిగింది.
Spread the love