- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన కందుగుల లక్ష్మీ-లింగయ్య దంపతుల కుమారుడు జీవన్ కుమార్-రీతురాజ్ నూతన దంపతుల వివాహం సోమవారం తాడిచెర్ల లోని ఎస్అండ్ఐకే కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ వివాహ మహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరికొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కు వెంకటస్వామి యాదవ్,రాజు నాయక్,కిషన్ నాయక్,కందుగుల రాజశేఖర్ పాల్గొన్నారు.
- Advertisement -



