బీఆర్ఎస్ పార్టీలోకి పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇందారం లాలయ్య

నవతెలంగాణ -తాడ్వాయి
తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య గురువారం రాత్రి బీఆర్ఎస్ లోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, రెడ్ కు వచ్చారు మాన్ సతీష్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ గోవింద నాయక్, మాజీ జెడ్పిటిసి రామసాయం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి సమక్షంలో చేరారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు స్పందించి బిఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు జిల్లాలో బీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని ప్రకటించేశారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన మావోయిస్టు కుటుంబ నేపథ్యం ఉన్న బడే నాగజ్యోతిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు.
Spread the love