నవతెలంగాణ-రాయికల్
మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో మహితాపూర్, రామోజీపేట, మూటపెల్లి, కొత్తపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కేంద్రాలను అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇంచార్జీ సాయికుమార్, సంబంధిత గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సీఈఓ ఎలిగేటి రవికుమార్, ఆయా గ్రామాల సర్పంచులు తలారి నాగమణి, బెజ్జంకి మోహన్, సంగెం కీర్తన, మీనుగు రాజగంగు, మాజీ డైరెక్టర్లు బేతి మోహన్ రెడ్డి, బోడ భూమరాజం, నాయకులు రమేష్, అంజయ్య, రైతులు పాల్గొన్నారు.
రాయికల్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -



