సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ – చేర్యాల
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల కార్యదర్శులు మంగళవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల రాష్ట్రంలో ఉన్న 9355 మంది కార్యదర్శుల జీవితాల్లో వెలుగు నింపినట్లు అయిందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్ణాకర్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పెడతల ఎల్లారెడ్డి, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love