పంచాయతీ భవన నిర్మాణాన్ని నిలిపివేసి న్యాయం చేయాలి

– బాధితుడు కోనేటి సమ్మయ్య అధికారులకు విజ్ఞప్తి 

– చీలాపూర్ సర్పంచ్ తీరుపై పంచాయతీ రాజ్ ఏఈకి పిర్యాదు
నవతెలంగాణ-బెజ్జంకి : అయ్యా..సర్పంచ్ గారు బ్రతుకుదేరువు కోసం ఊరు విడిచి ఇతర ప్రాంతానికి పోయామయ్య.తాము నివసించిన భూమిలో అక్రమంగా చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను నిలిపివేసి మా భూమిని మాకు అందజేసి న్యాయం చేయండయ్యా.. అని మండల పరిధిలోని చీలాపూర్ గ్రామానికి చెందిన కోనేటి సమ్మయ్య సర్పంచ్ కాళ్లు పట్టుకుని ప్రాదేయపడ్డాడు. ఇదంత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తుల ఎదుట జరిగింది.కాళ్లు పట్టుకుని ప్రాదేయపడిన సర్పంచ్ కనీకరించలేదని బాధితుడు వాపోయాడు.దీంతో తాము నివసించిన భూమిలో సర్పంచ్ చేపట్టిన అక్రమ పంచాయతీ భవన నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్ తీరుపై పంచాయతీ రాజ్ శాఖ ఏఈకి బాధితుడు సమ్మయ్య పిర్యాదు చేశాడు.తాము నివసించిన భూమిని తమకు అందజేసి అధికారులు న్యాయం చేయాలని బాధితుడు అవేదన వ్యక్తం చేశారు.
Spread the love