ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆశ్రమ పాఠశాలల పండిట్, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు. మంగళవారం శాసనసభ, శాసనమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ ప్రారంభ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ రెండు కమిటీల్లో ఆయన సభ్యులుగా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులుకు వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నత విద్య అభ్యసించేందుకు వీలుగా జీవో 342ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారికి వేతనంతో కూడిన సెలవును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.
ఆశ్రమ పాఠశాలల పండిట్, పీఈటీలను అప్గ్రేడ్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



