సుభాష్ పత్రీజీ గారి జన్మదిన సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మండలం లోని అంకాపూర్ గ్రామంలో శ్రీ కూనింటి శేఖర్ రెడ్డి పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కేకును కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పి ఎస్ ఎస్ ఎం జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణ రెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ నల్ల గంగారెడ్డి, నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం చైర్మన్ తిరుమల గంగారాం రెడ్డి , ముఖ్య సలహాదారులు బొడ్డు దయానంద్ , విశిష్ట అతిథులుగా డాక్టర్ నీలిమా , బ్రహ్మ కంటి గీతాంజలి ప్రసంగించారు ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలని సందర్భంగా వివరించారు. ధ్యానం వల్ల ఆనందం, ఐశ్వర్యం ధ్యానం వల్ల ఆరోగ్యం కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కిష్టయ్య, పెరికిట్ రమేష్, ఇస్సపల్లి చిన్నయ్య నారాయణ, కొత్తపల్లి రాజిరెడ్డి, ఇస్సపల్లి రాజు, గొల్ల మల్లయ్య, యోగ రాజేందర్, జీకే రమేష్, హేమంత్ కుమార్ 300 మంది ధ్యానులు పాల్గొన్నారు.