![](https://navatelangana.com/wp-content/uploads/2023/07/1689857532527.jpg)
మండలంలో గత మూడు నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల వాగులు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. కావున పశువుల కాపాలదారులు. పంట పొలాలకు వెళ్లే రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లి తిరుగు ప్రయాణంలో తగు జాగ్రత్తలు పాటించాలాని అన్నారు.అంతే కాకుండా రైతులు పొలంలో నాట్లు వేసేందుకు పొలాలు సిద్ధం చేస్తున్న తరుణంలో విద్యుత్ స్థంబాలు మరియు మోటార్ల వద్ద జాగ్రత్త ఉండలని మండల ప్రజలకు సూచించారు.