రజాకార్ విడుదల ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్

నవతెలంగాణ – హైదరాబాద్: నిజాం పాలన సమయంలో, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో హిందూ జనాభాపై రజాకార్లు చేసిన అకృత్యాలు అంతాఇంతా కాదు. రజాకార్ల ఆగడాలు, తెలంగాణ బిడ్డల బాధలు, త్యాగాలు, ఈ గడ్డ కోసం పోరాడిన వాళ్ల చరిత్ర ఆధారంగా ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్) ఈ పిటిషన్ వేసింది. ఈ నెల 11న ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ సందర్భంగా ఏపీసీఆర్ కార్యదర్శి నదీమ్ ఖాన్ మాట్లాడుతూ… పౌర హక్కులను పరిరక్షించడానికి, మత సామరస్యాన్ని ప్రోత్సాహానికే తాము పిటిషన్ వేశామని చెప్పారు. మరోవైపు దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, రాజాకార్ల అరాచకాలు, ఈ గడ్డ కోసం పోరాడిన వారి చరిత్ర చెప్పడానికే ఈ సినిమా తీశామని తెలిపారు.

Spread the love