ఇంటింటా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారం

నవ తెలంగాణ- మల్హర్ రావు: రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం, మంథనిలో ఎమ్మెల్యేగా విజయం సాదించేది అభివృద్ధి చేసేది పుట్ట మధే అని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ప్రచారంలో భాగంగా మండలంలో చిన్నతూoడ్ల, తాడిచెర్ల గ్రామాల్లో  కెసిఆర్ ప్రవేశపెట్టిన బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిపేస్టో ఇకటింటా ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌కు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్ది, సంక్షేమం పుట్ట మధూకర్‌తోనే సాధ్యమవుతాయన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరూ చేయలేని సాహసం చేశారని, కరోనాతో చనిపోయిన వారికి దగ్గరుండి అంత్యక్రియలు చేసిన చరిత్ర పుట్టదన్నారు. మంథని గడ్డపై గులాబీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి కారు గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love