– మెట్టు సాయికుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మత్య్సకారుల కుటుంబాలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరాల జల్లు కురిపించారని టీపీసీసీ ఫిషర్మెన్ కమిటీ చైర్మెన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డులు, బోట్లకు సబ్సిడీతో పెట్రోల్, డీజీల్, చనిపోయిన మత్య్సకారుల కుటుంబాలకు మూడు నెలల్లో నే జీవిత బీమా తదితర పథకాలను తమ పార్టీ ఇవ్వబోతుందని తెలిపారు. మత్య్సకారులను ఏనాడు పట్టించుకోనీ బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని ఆయన కోరారు.