– ఈదురుగాలులు వీచే అవకాశం
– పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
– రాష్ట్రంలో 151 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
– హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బుధ, గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న ప్రకటించారు. అదే సమయంలో పలు జిల్లాలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయని హెచ్చరించారు. రాబోయే రెండు రోజుల పాటు పగటి పూట ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీల మేర తగ్గే అవకాశముందని తెలిపారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారానికి సంబంధించి 25 జిల్లాలకు ఎల్లో హెచ్చరిక విడుదల చేశారు. రాష్ట్రంలో మంగళవారం 151 ప్రాంతాల్లో వర్షం కురిసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వాన పడింది. ఆ జిల్లాల్లో 50కి పైగా ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. హైదరాబాద్ జిల్లా షేక్పేటలో అత్యధికంగా 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అత్యధికంగా వర్షం కురిసిన ప్రాంతాలు
షేక్పేట్ (హైదరాబాద్) 5.2 సెంటీమీటర్లు
దిండిగల్(మేడ్చల్) 4 సెంటీమీటర్లు
లంగర్హౌస్(హైదరాబాద్) 3.9 సెంటీమీటర్లు
మణికొండ(రంగారెడ్డి) 3.8 సెంటీమీటర్లు
గచ్చిబౌలి(రంగారెడ్డి) 3.7 సెంటీమీటర్లు
వచ్చే మూడ్రోజులపాటు వర్ష సూచన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



