ఏఐవైఎఫ్  జిల్లా అధ్యక్షుడిగా రాజ్ కుమార్ 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
ఏఐవైఎఫ్  తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే దర్మేంద్ర సమక్షంలో మంగళవారం నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. ఏఐవైఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా జనగాం రాజ్ కుమార్,జిల్లా కార్యదర్శి గా కనుకుంట్ల శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు గా కూడిక్యాల రాజు, బిచ్చాల శ్రీనివాస్ సహాయ కార్యదర్శులు గా మిట్టపల్లి సుధాకర్, కందుకూరి అంతయ్య, జిల్లా కోశాధికారి గా రాయకుంట మంజులాల తో పాటు కార్యవర్గం 15 మంది, 21 మంది కౌన్సిల్ తో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ ఎన్నిక కు సహకరించిన సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డీ, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే దర్మేంద్ర కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Spread the love