నేడు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం 

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ మండల కేంద్రంలోని కే జే ఆర్ గార్డెన్ లో బుధవారం హుస్నాబాద్  నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు తెలిపారు. ఈ సమావేశానికి  ఏఐసీసీ సెక్రటరీ క్రిస్టఫర్ తిలక్, కరీంనగర్ మాజీ పార్లమెంట్ మెంబర్ పొన్నం ప్రభాకర్, పిసిసి ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య , హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తూముకుంట నరసారెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్తన్న, హనుమకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. నియోజవర్గ స్థాయి సమావేశానికి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో  హాజరు కావాలన్నారు.
Spread the love