ఎమ్మెల్యే ను సన్మానించిన మున్సిపల్ పాలకవర్గం

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.25 కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను మున్సిపల్ పాలకవర్గం ఘనంగా సన్మానించారు. ఇటివల హుస్నాబాద్ పట్టణ పర్యటనలో మంత్రి కేటీఆర్ ప్రకటించిన రూ.25 కోట్లు మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు కృత్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, కౌన్సిలర్లు  కొంకటి నలిని దేవి, పేరుక భాగ్యరెడ్డి, గోవిందు రవి, బొల్లి కల్పన, జనగామ రత్నమాల, బొజ్జ హరీష్, వాల సుప్రజా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడబోయిన తిరుపతిరెడ్డి, పట్టణ అధ్యక్షులు యండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love