ఓటు హక్కును వినియోగించుకున్న రజనీ, ధనుష్, విజయ్ సేతుపతి

నవతెలంగాణ – తమిళనాడు : లోక్‌సభ ఎన్నికలు 2024కి సంబంధించి త‌మిళనాడులో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని పోయెస్ గార్డెన్ పోలింగ్ బూత్‌లో త‌న‌ ఓటు వేశారు. తర్వాత నటుడు ధనుష్ టీటీకే రోడ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్‌లో ఓటు వేయ‌గా, కిల్‌పాక్‌లోని చెన్నై హైస్కూల్‌లో విజయ్ సేతుపతి ఓటు వేశారు.

 

Spread the love