జమ్మూకాశ్మీర్ అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం..

నవతెలంగాణ – జమ్మూ కాశ్మీర్‌
జమ్మూ కాశ్మీర్‌లో 62 రోజుల పాటు సాగే  అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఈ యాత్ర ఈ ఏడాది జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుంది. అమర్‌నాథ్‌కు ఉన్న రెండు దారుల్లోనూ ఒకేసారి యాత్ర ప్రారంభం కానుంది. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం మార్గం, గందేర్‌బల్‌ జిల్లా బల్తాల్‌ మార్గాల్లో ఒకదాన్ని యాత్రికులు ఎంచుకోవచ్చు. ఈ విషయాలను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా వెల్లడించారు. అయితే ఈ యాత్రలో 13 నుంచి 37 ఏళ్ల లోపు వయసున్న  వాళ్లు మాత్రమే ఈ యాత్రలో  పాల్గొనాలి.  యాత్రికులకు ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. 6 వారాలు లేదా అంతకంటే ఎక్కువ గర్భం ఉన్న స్త్రీలను ఈ యాత్రకు అనుమతించరు.

Spread the love