జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్దీకరించండి

– సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్‌ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీలను క్రమబద్దీకరించాలని ఎంపీ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. బుధవారం ఈమేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో గత 13 రోజుల నుంచి పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారని గుర్తు చేశారు. న్యాయపరమైన డిమాండ్లే కాబట్టి తక్షణమే వారికి మీరిచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉత్తమ్‌తో ఆస్ట్రేలియా అంబాసిడర్‌ భేటీ
ఆస్ట్రేలియా అంబాసిడర్‌ బృందం బుధవారం ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. శాలువా కప్పి స్వాగతం పలికారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. గాంధీభవన్‌ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పరిశీలించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఆస్ట్రేలియా హై కమిష నర్‌ భేరి ఓ ఫెరల్‌, ఆస్ట్రేలియా కౌన్సిల్‌ జనరల్‌ సారాకిర్లె, జాక్‌ టేలర్‌ పాల్గొన్నారు.

Spread the love