విడుదలైన చెక్కులను లబ్దిదారులకు వెంటనే అందించాలి..

– బహదూర్ పుర తహసిల్ దార్ చంద్ర శేఖర్ 

నవతెలంగాణ – ధూల్ పేట్ 
 షాది ముభారక్, కళ్యాణ లక్ష్మి ఇప్పటి వరకు బడ్జెట్ తో విడుదలైన చెక్కులను వెంటనే లబ్దిదారులకు అందించాలని బహదూర్ పుర మండల తహసిల్ దార్ చంద్ర శేఖర్ కార్యాలయ సిబ్బందికి ఆదేశించారు. బహదూర్ పుర మండల తహసిల్ దార్ గా భాద్యతలు చెప్పట్టిన ఆయన మండల కార్యాలయం చుట్టూ లబ్ది దారులు వస్తుండటంతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దృవీకరణ పత్రాలను విచారణ చేసి, పరిశీలించి వెంటనే అందించాలన్నారు. సరైన పత్రాలను జతపరచిన వారికి ఇబ్బందులకు గురి చేయకూడదన్నారు. షాది ముభారక్, కళ్యాణ లక్ష్మి పెండింగ్ లేకుండా చూడాలని సిబ్బందికి  సూచించారు. షాది ముభారక్, కళ్యాణ లక్ష్మి దారఖాస్తు చేసుకున్న లబ్దిదారుల క్రమం ప్రకారం పరిశీలించి ఆన్ లైన్ పంపించాలన్నారు. వెనుక వారివి ముందు, ముందు వారివి వెనకకు చేయకూడదని ఆదేశించారు. లబ్దిదారులు కార్యాలయం చుట్టూ తిరిగేలా కాకుండా ఎప్పటి పనులు అప్పుడే సాధ్యమైనంత వరకు పూర్తి చేసి సేవలందించాలని సుచంచారు.
Spread the love