రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

– గిరిజనుల జోలికి వస్తే ఖబర్దార్: రవీందర్ నాయక్
నవతెలంగాణ- పెద్దవంగర: గిరిజనుల జోలికి వస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని ఎంపీటీసీల ఫోరం మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ బానోత్ రవీందర్ నాయక్ అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం బీఆర్ఎస్ గిరిజన నాయకులు ఆయన విగ్రహాన్ని దగ్ధం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం తగదన్నారు. ఐక్యంగా ఉన్న గిరిజనుల్లో వర్గీకరణ పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సిగ్గుచేటు అన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గిరిజనుల జోలికొస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, మౌలిక వసతులు కల్పిస్తున్న ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేయడం రేవంత్ రెడ్డి మానుకోవాలన్నారు. గిరిజనుల జోలికి వస్తే రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచులు పటేల్ నాయక్, భీమా నాయక్, గోపాల్ నాయక్, రాజేందర్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకన్న నాయక్, మండల అధికార ప్రతినిధి బానోత్ సోమన్న నాయక్, మండల గిరిజన నాయకులు జాటోత్ దస్రు నాయక్, హేమాని నాయక్, శంకర్ నాయక్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love