రేవంత్ రెడ్డి చిత్రాన్ని గీసిన భానుతేజ

నవతెలంగాణ- కోస్గి: కాంగ్రెస్ పార్టీ టి పి సి సి ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి పై అభిమానంతో కోస్గి మున్సిపాలిటీలోని 11వ వార్డుకు చెందిన భాను తేజ 12 గంటల మించి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని గీశాడు. కొడంగల్ నియోజ కవర్గం లోని కోస్గి మున్సిపాలిటీలోని 11 వ వార్డులో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న కోస్గి మున్సిపల్ ముఖ్య నాయకులు ఆ బాలుని ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ల అమ్మానాన్నలతోని మాట్లాడరు. అమ్మ, నాన్నల,  బాలుని కోరిక మేరకు రేవంతన్న కు డ్రాయింగ్ ని బహుమానంగా కలిసి ఇస్తానని కోరడంతో భానుతేజను రేవంతన్నతో కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాలుడు వేద ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు.

Spread the love