ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కేంద్ర బృందం

నవతెలంగాణ- రేవల్లి
గోపాల్ పేట్ మండలకేంద్రంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి జాతీయ నాణ్యత ప్రమాణ అధికారులు బృందం డాక్టర్ అశోక్ మరియు డాక్టర్ భావిన్ వగాడియా రెండు రోజులు గా పరిశీలించారు. బృందం వారు అందుతున్న ప్రస్తుతి విభాగం, జనరల్ చెకప్ విభాగం, వ్యాక్సినేషన్ సెంటర్ ,వ్యాధి నిర్ధారణ  టెస్టుల విభాగంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్న విధానం ను రికార్డ్స్ లో పరిశీలించారు. మంగళవారం రోజున బుద్ధారం టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ స్కూలు మరియు చెన్నూరు ఆరోగ్య కేంద్రాన్ని  సందర్శించారు.అందుతున్న అన్ని ఆరోగ్య సేవలను డాక్టర్ మంజులను  మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు పలు సూచనలు బృందం వాళ్లు చేశారు.  ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవలకు సంతోష వ్యక్తం చేశారు .కేంద్ర బృందం వెంబడి డాక్టర్ ఇస్మాయిల్ . డాక్టర్ రాకేష్ రెడ్డి,  ఉండి అన్ని ప్రోగ్రాంలో గురించి తెలిపారు. ఇ కార్యక్రమంలో డాక్టర్ క్లైవీల్ మార్క్, సంజయ్, బాబు నాయక్,  క్వాలిటీ మేనేజర్ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు .
Spread the love