– వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్…
– పలువురు ఐఏఎస్ల బదిలీలుొ మరికొంత మందికి అదనపు బాధ్యతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ట్రాన్స్కో, జెన్కో సహా వివిధ శాఖలకు చెందిన అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ను ప్రభుత్వం నియమించింది. ఇంధన శాఖ కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్వీని నియమించిన ప్రభుత్వం.. ట్రాన్స్కో, జెన్కో సీఎండీగానూ రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి నియమితులయ్యారు. మూసీ అభివద్ధి సంస్థ ఇన్చార్జి ఎమ్డీగానూ ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్, ట్రాన్స్కో సంయుక్త ఎండీగా సందీప్కుమార్ ఝూ, దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కమ్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బి.గోపి నియమితులయ్యారు.