రహదారులే రైతుల ధాన్యం కల్లాలుగా!

నవతెలంగాణ – గోవిందరావుపేట
రహదారులే రైతులకు దాన్యం కల్లాలుగా మారుతున్నాయి. రహదారుల వెంట పొడవున ఖాళీ స్థలం కనిపించడంతో ధాన్యాన్ని ఆరబోసేందుకు అనువుగా ఉందని రైతులు రహదారులను ఆశ్రయిస్తున్నారు. మండల వ్యాప్తంగా రైతులు సుమారు 15 వేల ఎకరాలకు పైగా వరి పంట సాగు చేస్తున్నారు. గతంలో రైతులు ఎవరి పొలంలో వారు పంట కోసి కుప్ప వేసి నూర్పిడి చేసుకునేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారిన కాలానికి అనుగుణంగా యాంత్రిక విధానం అమలులోకి వచ్చిన కా నుండి యంత్రాలు పంటను కోయడం వల్ల కొయ్య కాలు ఎత్తుగా ఉండి రైతుల పొలంలో ధాన్యం ఆరబోసేందుకు అనుకూలంగా లేని పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కి తోలుదామంటే ఎక్కడా కూడా విశాలమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవు. ఒక 20 మంది రైతులు 50 ఎకరాల ధాన్యాన్ని ఆరబోశారంటే ఆ కొనుగోలు కేంద్రంలో ఆ ధాన్యం ఆరి కాంటాలు అయి లోడ్ అయి వెళ్లిన తర్వాతే మరి కొంతమంది రైతులకు ధాన్యం ఆరబోసుకునే అవకాశం లభిస్తుంది. ఒకే గ్రామంలో వేలాది ఎకరాల్లో రెండు మూడు రోజుల్లోనే పంట పొలాలను కోయడం వల్ల దాన్యం ఆరబోసుకునేందుకు స్థలాల కరువు నెలకొంది. తప్పని పరిస్థితిలో రైతులు రహదారులను ఆశ్రయిస్తున్నారు. రైతులు రహదారులను ఆశ్రయించి ధాన్యాన్ని ఆరబోయడం రహదారుల పొడవున్న తిరుగుతున్న కలెక్టర్ అధికారులు మంత్రులు సంవత్సరాల తరబడి చూస్తున్న రహదారుల వెంట ప్రమాదాలు జరుగుతున్న ప్రత్యామ్నాయ మార్గాలను రైతులకు సూచించకపోవడం విచారకరమని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము అధికారులు కలెక్టర్ మంత్రులు రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించి రహదారుల వెంట ధాన్యాన్ని ఆరబోసే విధానానికి స్వస్తి చెప్పించి ప్రమాదాల నివారణకు సహకరించి వాహన చోదకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలనీ రైతులు అంటున్నారు. కొన్ని కొన్ని సమయాలలో అధికారులు పోలీసులు రైతులను ధాన్యం రహదారుల వెంట ఆరపోయేవొద్దని చెప్పినా తప్పని పరిస్థితుల్లో ధాన్యాన్ని ఆరబోస్తున్నామని అంతకంటే మరో మార్గం లేదని రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితుల్లో వారు కూడా నిస్సహాయంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం కోసి పొలంలో ఆడబోయేలేని పరిస్థితి, ఇంటికి తోలి ఆరపోద్దామంటే ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉండదు, స్థలం ఉన్నవారికి తరలించేందుకు వాహనం వచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రహదారుల వెంట ఉండే ఖాళీ స్థలాన్ని ఆశ్రయిస్తున్నామని రైతులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చలువాయి ప్రాంతంలో చల్వయి నుండి మొదలుకొని గోవిందరావుపేట వరకు రైతులు జాతీయ రహదారి వెంట ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలంలో ధాన్యాన్ని ఆరపోసుకొని ఆరిన వెంటనే కాంటాలు వేసి తరలిస్తున్నారు. ఇది తాత్కాలిక మే అని శాశ్వతంగా పర్మినెంట్గగా రైతాంగం ధాన్యం ఆరబోసుకునేందుకు అవసరమైన స్థల సేకరణ ప్రభుత్వం చేసి అందించినట్లయితే ప్రభుత్వ ప్రయత్నాలు హర్షిస్తామని రైతు సంఘాల రైతులు అంటున్నారు.
ప్రతి గ్రామానికి ధాన్యం ఆరబోసుకునేందుకు పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలి. బుడిగె రఘు చల్వాయి రైతు
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతి గ్రామంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి. ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతి వనం క్రీడ మైదానాలను నిర్మించినట్లే రైతులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ధాన్యం ఆరబోసుకునేందుకు వీలు కల్పించాలి అక్కడే ధాన్యం ఖరీదులు కాంట లోడు చేయించి పంపించే విధంగా చర్యలు చేపట్టాలి. రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ధాన్యం ఆరబోత సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.
1. ఫోటో 163వ జాతీయ రహదారి వెంట ఉన్న ధాన్యం రాశులు
2. బొడిగె రఘు చల్వాయి రైతు.

Spread the love