గిగ్‌ వర్కర్లకు రూ.5లక్షల ప్రమాద బీమా జర్నలిస్టులకు కూడా..

– ఉత్తర్వులు జారీ..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో రవాణా, రవాణాయేతర ఆటో డ్రైవర్లు, స్విగ్గీ, జుమోటో వర్కర్లు (గిగ్‌ వర్కర్లు) హోంగార్డులు, వర్కింగ్‌ జర్నలిస్టుల కోసం రూ. ఐదు లక్షల ప్రమాద బీమాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరించనుంది. గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఇటీవల నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు వారికి ప్రమాద బీమా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Spread the love