‘ఎస్సీ జాబితాలో చేర్చాలి’

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీని దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్‌ సాధన సమితి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల పోచయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఎస్సీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు ప్రకటించిన ఆ పార్టీ దళిత క్రైస్తవులను విస్మరించిందని విమర్శించారు. ఇదే వైఖరితో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తే దళిత క్రైస్తవులకు ఆ పార్టీకి దూరం కావడం ఖాయమని హెచ్చరించారు. దళిత హిందువులు, దళిత బుద్ధిస్టులు, దళిత సిక్కులు ఎస్సీలుగానే కొనసాగుతుండగా, దళిత క్రైస్తవులను మాత్రం ఎస్సీలుగా గుర్తించకుండా అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love