![](https://navatelangana.com/wp-content/uploads/2023/08/image01.jpeg)
నవతెలంగాణ – కేసముద్రం : మండలం లోని కల్వల గ్రామా శివారున వున్న మోడల్ స్కూల్ కు RTC బస్సు లు నడపాలని కోరుతూ డిపో సూపరిండెంట్ కు ఆమ్ ఆద్మీ విద్యార్ధి సంఘం ఆధ్వర్యములో వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భం గా CYSS అధ్యక్షుడు గుగులోతు శరత్ మాట్లాడుతూ మోడల్ స్కూల్ కి దాదాపు 300 మంది విద్యార్థులు ప్రైవేట్ వాహనం లో వస్తున్నారు అని సంవత్సరానికి 20 వేళా రూపాయలు ఖర్చూ చేసుకోవాల్సి వస్తుంది అని వెంటనే వారికీ ఆ రూట్ లో బస్సు లు నడపాలని స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటుతున్న గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం శోచనీయం అని అన్నారు . ఆ ప్రభుత్వ పాఠశాల లో చదివే విద్యార్థులు కు అన్ని రూట్ లో బస్సు నడపాలని డిమాండ్ చేసారు . కార్యక్రమములో నల్లకుంట రాజేందర్ , పటేల్ , భరత్ తదితరులు పాల్గొన్నారు