మద్నూర్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం సింగిల్ విండో కార్యాలయంలో ఈనెల 3న బుధవారం ఉదయం 10 గంటలకు సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ పటేల్ అధ్యక్షతన జరుగుతుందని సింగిల్ విండో కార్యదర్శి జే బాబురావు సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రైతు భరోసా జన సమీకరణ సమావేశానికి సంఘం కార్యవర్గ సభ్యులు సింగిల్ విండో పరిధిలోని వ్యవసాయ రైతులు అందరూ సకాలంలో హాజరుకావాలని కార్యదర్శి తెలియజేశారు.