బోధన్‌ నుంచి మద్నూర్‌ వరకు నాలుగు లేన్ల రోడ్డు మంజూరు

– ఎంపీబి.బి పాటిల్‌ చొరవకు మంత్రి వేముల అభినందన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌:
నిజామాబాద్‌,కామారెడ్డి జిల్లాల్లోని బోధన్‌ నుంచి మద్నూర్‌ వయా రుద్రూర్‌ వరకు(ఎన్‌హెచ్‌-63) 38 కిలోమీటర్ల పొడవు గల డబుల్‌ లేన్‌ రోడ్డును నాలుగు లేన్ల జాతీయ రహదారిగా మార్చేందుకు కృషి చేసిన జహీరాబాద్‌ ఎంసీ బీబీ పాటిల్‌ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అభినందించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ఎంపీ చూపిన ప్రత్యేక చొరవ పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ 38 కి. మీ డబుల్‌ లేన్‌ రోడ్డు రూ. 750 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డుగా అభివృద్ది చెందనుం దన్నారు. ఈ రోడ్డు మంజూరు కోసం ఎంపీ బీబీ పాటిల్‌ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి పలు మార్లు లేఖలు రాసి, పలు దఫాలు ఆయన్ను ప్రత్యేకంగా కలిసి రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఎంపీ పాటిల్‌ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర రోడ్డు రవాణా,హైవేస్‌ శాఖ నాలుగు లేన్ల రోడ్డు మంజూరుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఆ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆదేశాలతో కూడిన బుధవారం లేఖ రాసిందని తెలియజేశారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

Spread the love